Samantha : చైతూతో కలిసి ఉన్న ఇంటిని ఎక్కువ డబ్బిచ్చి కొనుక్కున్న సమంత

మురళి మోహన్ మాట్లాడుతూ.. ''నాగచైతన్య- సమంత మా ఇల్లు కొనుక్కున్నారు. పెళ్లి తర్వాత అందులోనే కలిసి ఉన్నారు. తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కొనుక్కోవడంతో.......

Samantha :  చైతూతో కలిసి ఉన్న ఇంటిని ఎక్కువ డబ్బిచ్చి కొనుక్కున్న సమంత

Samantha

Samantha :  చైతూ, సమంత విడిపోయి కొన్ని నెలలు అవుతున్నా ఇంకా వారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సమంత చైతూ గురించి మాట్లాడటంతో మరోసారి వీరిద్దరూ వార్తల్లోకెక్కారు. తాజాగా సమంత గురించి మరో న్యూస్ వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత సమంత చైతూ కలిసి ఉన్న ఇంటిని విడిపోయిన తర్వాత ఎవరికి వారు వెళ్లిపోవడంతో ఆ ఇంటిని సమంత ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంది. సీనియర్ నటులు మురళి మోహన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మురళి మోహన్ మాట్లాడుతూ.. ”నాగచైతన్య- సమంత మా ఇల్లు కొనుక్కున్నారు. పెళ్లి తర్వాత అందులోనే కలిసి ఉన్నారు. తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కొనుక్కోవడంతో వాళ్ళు ఉన్న ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేశారు. అయితే వారు కొనుక్కున్న ఇల్లు రీ మోడలింగ్ చేయించేంతవరకు పాత ఇంట్లోనే రెంట్ కి ఉంటాము అనడంతో సమంత వాళ్ల దగ్గర ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఓకే చెప్పారు. అయితే ఈ లోపే సమంత, చైతన్య విడిపోయారు. తర్వాత సొంత ఇంటి కోసం సమంత బయట చాలా వెతికింది కానీ తనకి నచ్చలేదు. దీంతో నా దగ్గరికి వచ్చి వాళ్ళు అంతకు ముందు ఉన్న ఇల్లే కావాలని అడిగింది. నేను మీకు అమ్మాను, మీరు వేరేవారికి అమ్మారు కదా నేనేం చేయలేను అనడంతో ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారు కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ చైతూతో కలిసి ఉన్న ఇంటిని మళ్ళీ కొనుక్కుంది. ప్రస్తుతం సమంత అక్కడే తన తల్లితో కలిసి ఉంటుంది” అని తెలిపారు.

Chikoti Praveen : సినీ పరిశ్రమకి పాకిన చికోటి సంచలనం.. హీరోయిన్స్ పై ఈడీ దృష్టి??

సమంత చైతన్యతో కలిసి ఉన్న ఇంటిని కొనడంతో ప్రస్తుతం మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కొంతమందేమో బయట చాలా ఉన్నా దాన్ని ఎక్కువ డబ్బులిచ్చి కొనడం ఎందుకు అని కామెంట్స్ చేస్తుంటే, కొంతమంది చైతూతో ఉన్న జ్ఞాపకాల కోసం కొందని కామెంట్స్ చేస్తున్నారు.