Bndi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే: బండి సంజయ్

సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్‌లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగింది. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే.

Bndi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే: బండి సంజయ్

Bndi Sanjay

Bndi Sanjay: ముఖ్యమంత్రి కార్యాలయం కుట్ర వల్లే సికింద్రాబాద్ విధ్వంసం జరిగిందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంఛార్జిల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే ఘటనపై స్పందించారు.

Visakhapatnam: ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. విశాఖ రైల్వే స్టేషన్‌లోకి నో ఎంట్రీ

‘‘సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్‌లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగింది. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే. శాంతి భద్రతలు కాపాడాల్సింది రాష్ట్ర పోలీసులు. కేంద్ర బలగాలు కాల్పులు జరపలేదు. పెట్రోల్ తీసుకు వచ్చింది ఎవరు? విధ్వంసం చేసింది ఎవరు? దుండగులు పెట్రోల్ పోసి, బాంబులు వేసి, గోడలు కూల్చి వెళ్లిపోయారు. అమాయకులు గాయపడ్డారు. ట్విట్టర్ మంత్రి ఆదేశాలు ఇచ్చేవరకు పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించలేదు. మృతుడి కుటుంబానికి అండగా ఉండాలి. సీఎం ఈ విషయంలో వెంటనే స్పందించారు. సునీల్ నాయక్ అనే వ్యక్తి సీఎం పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నా స్పందించలేదు. ఆయన అంతిమయాత్రలో మాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంతిమయాత్ర పేరుతో కేంద్ర సంస్థలపై దాడులు చేస్తోంది.

Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్

రాష్ట్ర పోలీసులు కాల్పులు జరిపితే, కేంద్రంపై బురద చల్లడం సిగ్గుచేటు. ఆర్మీ అభ్యర్థులారా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. మీకు న్యాయం జరుగుతుంది. మీ జీవితాలతో చెలగాటమాడే రాజకీయ శక్తుల కుట్రలను చేధించండి. ‘అగ్నిపథ్’ గొప్ప పథకం. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు దీనికి సంబంధం లేదు’’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.