Sherlin Chopra : శిల్పాశెట్టి దంపతులపై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన షెర్లిన్ చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా అంతకుముందే రాజ్ కుంద్రా పై కేసు వేసింది. ఇటీవల రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాక మళ్ళీ తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు
Sherlin Chopra : ఇటీవల శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో కొంత మంది బాలీవుడ్ మోడల్స్, హీరోయిన్స్ రాజ్కుంద్రా తమను కూడా వేధించారు అంటూ కంప్లైంట్స్ ఇచ్చారు. ఇదే కోవలో బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా అంతకుముందే రాజ్ కుంద్రా పై కేసు వేసింది. ఇటీవల రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాక మళ్ళీ తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టులో కేసు వేసింది. అంతే కాక శిల్పాశెట్టి- రాజ్కుంద్రా తనను అండర్ వరల్డ్తో బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.
Pooja Hegde : కొత్త ఇంట్లోకి పూజహెగ్డే.. ముంబైలో సూపర్ హౌస్..
ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ శిల్పాశెట్టి- రాజ్కుంద్రా దంపతులు రూ.50 కోట్లకు షెర్లిన్ చోప్రా పై పరువు నష్టం దావా వేశారు. రాజ్కుంద్రాపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేస్తూ షెర్లిన్ చెప్పినవన్నీ అవాస్తవమేనని, ఆరోపణల్ని నిరూపించేందుకు ఆమె వద్ద తగిన ఆధారాలూ లేవన్నారు. వివాదాలు సృష్టించేందుకు, మీడియాను ఆకర్షించేందుకు ఆమె ఇలా చేసిందంటూ శిల్పాశెట్టి- రాజ్కుంద్రా స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
Bommarillu Bhaskar : మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి బొమ్మరిల్లు భాస్కర్.. మెగా హీరోతో సినిమా??
దీనిపై తాజాగా షెర్లిన్ చోప్రా స్పందిస్తూ శిల్పాశెట్టి – రాజ్కుంద్రా తనను అండర్ వరల్డ్తో బెదిరింపులకు గురిచేశారని, ఇప్పుడు పరువునష్టం నోటీసులు కూడా ఇచ్చారని, కాని ఇలాంటివాటికి నేను భయపడను అని తెలిపింది. అంతే కాక తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు అడుగుతూ తానే తిరిగి వాళ్లకు నోటీసులు పంపానని తెలిపింది. గతంలో రాజ్కుంద్రాపై చేసిన ఫిర్యాదుపై విచారణకు తన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని పోలీసులను కోరతానని షెర్లిన్ చెప్పింది. షెర్లిన్పై పరువు నష్టం దావా వేయడంపై ఆమె తరఫు న్యాయవాది సుహైల్ షరీఫ్ స్పందిస్తూ.. వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు పరువు నష్టం దావాను ఓ ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరమని తెలిపారు.