Shruthi Haasan : ఆయన టాలీవుడ్ లో నాకు అన్నయ్య లాంటివాడు..

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ మాట్లాడుతూ.. ''మైత్రి మూవీ మేకర్స్ లో ఇది నా మూడో సినిమా. నా ఫ్యామిలీ నిర్మాణ సంస్థలా అనిపిస్తుంది. డైరెక్టర్ గోపీచంద్ తో కూడా నాకు ఇది మూడో సినిమా. నాకు వరుసగా అవకాశాలు ఇస్తున్నందుకు...............

Shruthi Haasan : ఆయన టాలీవుడ్ లో నాకు అన్నయ్య లాంటివాడు..

Shruthi Haasan speech in veerasimha reddi pre release event

Shruthi Haasan :  బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ సినిమా వీరసింహా రెడ్డి. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మలయాళం హీరోయిన్ హనీ రోజ్ కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా విలన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి బాలయ్య బాబు మాస్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు అభిమానులు. ఇక చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా శుక్రవారం నాడు వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా వచ్చి సందడి చేశారు.

KGF 2 : కేజీఎఫ్-2 నేను చూడలేదు, చూడను కూడా.. కాంతార నటుడు!

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ మాట్లాడుతూ.. ”మైత్రి మూవీ మేకర్స్ లో ఇది నా మూడో సినిమా. నా ఫ్యామిలీ నిర్మాణ సంస్థలా అనిపిస్తుంది. డైరెక్టర్ గోపీచంద్ తో కూడా నాకు ఇది మూడో సినిమా. నాకు వరుసగా అవకాశాలు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సినిమాల పరంగానే కాదు పర్సనల్ గా కూడా గోపి నాకు చాలా సపోర్ట్ గా ఉంటాడు. టాలీవుడ్ లో గోపీచంద్ మలినేని నాకు ఒక అన్నయ్యలా ఉంటాడు. ఇక బాలయ్య గారు నిజంగా సింహం. మంచి మనసున్న ఆయన, అందరితో సరదాగా ఉంటారు” అని తెలిపింది. అలాగే చివరికి అందరిలాగే జై బాలయ్య అని అరిచి అభిమానులకి జోష్ ఇచ్చింది.