Shreyas Iyer:’శ్రేయాస్ అయ్యర్ కోసం ఆర్సీబీ రూ.20కోట్లు’

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు నిర్వాహకులు. అందులో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మొహమ్మద్ షమీలతో పాటు...

Shreyas Iyer:’శ్రేయాస్ అయ్యర్ కోసం ఆర్సీబీ రూ.20కోట్లు’

Shreyas Iyer

Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు నిర్వాహకులు. అందులో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మొహమ్మద్ షమీలతో పాటు ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే పలు ఫ్రాంచైజీలు తమ జట్లకు కెప్టెన్ కోసం ఈ ఐపీఎల్ వేలాన్ని వేదిక చేసుకున్నాయి. అందులో ఆర్సీబీ కూడా ఒకటి. ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ లోనే విరాట్ కోహ్లీ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడంతో ఫ్రాంచైజీకి వెదుకులాట తప్పడం లేదు. ముందస్తు జాగ్రత్తగా గ్లెన్ మ్యాక్స్ వెల్ ను వేలానికి విడిచిపెట్టకుండా అట్టిపెట్టుకున్నప్పటికీ కెప్టెన్ కోసం సెర్చింగ్ జరుగుతూనే ఉందట.

తనకు అందిన సమాచారంతో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆర్సీబీ ప్లానింగ్ ను రివీల్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కోసం బెంగళూరు జట్టు దాదాపు రూ.20కోట్లు కేటాయించనుందని సొంత యూట్యూబ్ ఛానెల్ లో వెల్లడించాడు.

Read Also : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీచేతుల్లో?…

ఒక కెప్టెన్ కోసం రూ.20కోట్లు లాంటి పెద్ద మొత్తాన్ని వెచ్చించడం కరెక్ట్ కాదని అలా జరిగితే టీం అంతా డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నాడు. మంచి కెప్టెన్ ఉన్నప్పటికీ టీం బలహీనపడితే ఏం చేయగలరని ప్రశ్నిస్తున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కు 2018, 2019, 2020సీజన్లకు కెప్టెన్సీ వహించిన శ్రేయాస్ చివరి సీజన్లో బ్రేక్ ఇచ్చాడు.