The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

తాజాగా ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. అమెరికాలోనే అత్యున్నత ప్రజాస్వామిక రాష్ట్రమైన రోడ్ ఐలాండ్ 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని గుర్తించింది. ఈ చిత్రాన్ని అభినందిస్తూ..........

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

Kashmir Files

 

The Kashmir Files :  ఇటీవల కశ్మీర్ లో హిందువులపై, కాశ్మీర్ పండిట్లపై 1980-90 దశకంలో జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు. మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.

బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన వారంతా డైరెక్టర్, చిత్ర యూనిట్ లను అభినందిస్తున్నారు. నరేంద్ర మోడీతో సహా సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని, చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. అమెరికాలోనే అత్యున్నత ప్రజాస్వామిక రాష్ట్రమైన రోడ్ ఐస్‌ల్యాండ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని గుర్తించింది. ఈ చిత్రాన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా సర్టిఫికెట్ ని జారీ చేసింది.

RGV : కొత్త చరిత్ర సృష్టించారంటూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పై ఆర్జీవీ ట్వీట్..

దీనిపై సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. ఆ సర్టిఫికెట్ ని షేర్ చేస్తూ.. ”32 సంవత్సరాలలో మొట్టమొదటి సారిగా యుఎస్ఏ లోని అత్యంత ప్రజాస్వామిక ఉదరావాద రాష్ట్రమైన రోడ్ ఐస్‌ల్యాండ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని గుర్తించింది. ఈ మూవీ ద్వారా ఇచ్చిన సందేశాన్ని అధికారికంగా గుర్తిస్తూ సర్టిఫికెట్ ని అందించింది. రోడ్ ఐస్‌ల్యాండ్ గుర్తించి ఇచ్చిన సర్టిఫికెట్ ని చూడండి. అందులో వున్న విషయాల్ని బట్టి ఎవరు ఎవరిని వేధించారో? ఎవరికి శిక్ష విధించాలో నిర్ణయించుకోండి” అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఈ సినిమా మరిన్ని అవార్డులు సాధిస్తుందని అంటున్నారు చిత్ర బృందం.