CCL 2023 : టేబుల్ టాప్‌లో తెలుగు వారియర్స్, చివరిలో బాలీవుడ్.. అఖిల్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో తెలుసా?

సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) ఇటీవల తిరిగి మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లోని మ్యాచ్‌లు చూస్తుంటే దేశంలో ఐపిఎల్ ముందుగానే స్టార్ అయ్యినట్లు అనిపిస్తుంది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్‌ అక్కినేని తన బ్యాటింగ్ తో విద్వంసం సృష్టిస్తున్నాడు.

CCL 2023 : టేబుల్ టాప్‌లో తెలుగు వారియర్స్, చివరిలో బాలీవుడ్.. అఖిల్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో తెలుసా?

CCL 2023

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) ఇటీవల తిరిగి మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లోని మ్యాచ్‌లు చూస్తుంటే దేశంలో ఐపిఎల్ ముందుగానే స్టార్ అయ్యినట్లు అనిపిస్తుంది. సినిమాల్లో ఫైట్స్ తో అదరగొట్టే హీరోలు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో బౌండరీలు కొడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఫిబ్రవరి 18న మొదలైన ఈ లీగ్ లో.. ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు జరిగాయి. మొత్తం ఎనిమిది టీమ్స్ నాలుగు ఫార్మాట్స్ లో తలపడి.. ది బెస్ట్ టీంస్ సెమీ ఫైనల్, ఫైనల్ ఆడబోతున్నాయి. ఇక ఈ లీగ్ లో మన తెలుగు వారియర్స్ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.

CCL 2023 : కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. అఖిల్ అక్కినేని స్కోర్ ఎంతో తెలుసా?

గత వారం (ఫిబ్రవరి 19) తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ పై తమ మొదటి మ్యాచ్ ని ఆడారు. ఈ మ్యాచ్ లు రెండు ఇన్నింగ్స్ గా సాగుతున్నాయి. మొదటి ఇన్నింగ్స్ – 10 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్ – 10 ఓవర్లు. ఇక మొదటి మ్యాచ్ లో తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ పై విజయం సాధించి తమ విజయ యాత్రని మొదలు పెట్టారు. నిన్న (ఫిబ్రవరి 25) రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో కూడా తెలుగు హీరోలు విజయం సాధించి 4 పాయింట్ లతో టేబుల్ టాప్ పొజిషన్ లో నిలిచింది. తరువాత స్థానంలో భోజపురి భోజ్‌పురి దబాంగ్స్ నిలిచింది. ముంబై హీరోస్ టేబుల్ చివరి స్థానంలో నిలిచింది.

ఇదే జోరులో తెలుగు వారియర్స్ సాగితే ఈ ఏడాది CCL కప్ ని తెలుగు హీరోలు ఎత్తడం ఖాయం. ఇక తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్‌ అక్కినేని తన బ్యాటింగ్ తో విద్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో నాలుగు ఇన్నింగ్స్ గాను 246 పరుగులు చేసి హైయెస్ట్ రన్స్ కొట్టిన బ్యాట్స్ మ్యాన్ గా నిలిచాడు. దీంతో 261 స్ట్రైక్ రేట్ తో మొదటి స్థానంలో నిలబడ్డాడు. ఇక అఖిల్ బ్యాటింగ్ విద్వంసం చూసిన టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కాగా మూడో మ్యాచ్ మర్చి 4న పంజాబ్‌ దే షేర్‌ టీంతో ఆడబోతున్నారు.