Thaman : ముచ్చటగా మూడోసారి..

ఇప్పటికే సూపర్ స్టార్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట’కు థమన్ సంగీతమందిస్తున్నాడు.. మహేష్ బాబు 28వ సినిమాకు కూడా థమన్‌ను సెలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు..

Thaman : ముచ్చటగా మూడోసారి..

Thaman To Compose Music For Ssmb 28 Movie

Thaman: షూటింగ్ ఇంకా షురూ కాకముందే క్రేజీ అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి మహేష్ బాబు న్యూ ప్రాజెక్ట్ గురించి.. త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పేరు నుంచి హీరోయిన్స్ వరకు ప్రజెంట్ వైరల్ అవని విషయం లేదు. రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.

మహేశ్ 28వ సినిమా.. ఈ హాట్ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కాబట్టి కామన్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి. సో ఆ ఎగ్జైజ్‌మెంట్‌ను మరింత పెంచేందుకు క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కలిసొచ్చిన ‘అతడు’ క్యారెక్టర్ నేమ్ ‘పార్ధు’ నే ఈ సినిమా టైటిల్‌గా అనుకుంటున్నారనే రూమర్ నడిచింది. దీన్ని ఎవరు కొట్టేయలేదు కూడా. ఇక ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ డైరెక్టర్‌నే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చేసినట్టు తెలుస్తోంది.

Sumanth : సూపర్‌స్టార్ సినిమాలో సుమంత్..!

థమన్.. ఈమధ్య అందరి దృష్టీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ పైనే ఉంది. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. థమన్ సంగీతంతో సినిమాపై భారీ హైప్ వస్తోంది కాబట్టి.. మహేష్ బాబు 28వ సినిమాకు కూడా థమన్‌ను సెలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట’కు థమన్ సంగీతమందిస్తున్నాడు. ఆ వెంటనే థమన్ సంగీతంలో త్రివిక్రమ్ – మహేష్ మూవీ రాబోతుంది. అటు త్రివిక్రమ్‌కు థమన్ సెంటిమెంట్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ మ్యూజిక్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.. ‘అరవింద సమేత’ కు మంచి పాటలు, అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చాడు థమన్.. థమన్ కనుక ఫిక్స్ అయితే.. మహేష్, త్రివిక్రమ్, థమన్.. ఈ ముగ్గురి కలయికలో రాబోయే మూడో సినిమా ఇదే అవుతుంది..

అన్నీ అనుకున్నట్టు జరిగుంటే త్రివిక్రమ్ – మహేష్ ప్రాజెక్ట్.. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ ‌డ రోజున ప్రారంభమయ్యేది. కానీ కోవిడ్‌తో దానికి బ్రేక్ పడింది. అయితే జూలైలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు 28వ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డేను త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు. మరో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ బాగా ట్రై చేస్తున్నారని అంటున్నారు..