Election Laws Bill : ఆధార్- ఓటర్ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానికి సంబంధించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కింది. విపక్షాలు లఖింపూర్ ఖేరి ఘటనపై ఆందోళనలు చేస్తుండగానే.. సభలో
Election Laws Bill : ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానికి సంబంధించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కింది. విపక్షాలు లఖింపూర్ ఖేరి ఘటనపై ఆందోళనలు చేస్తుండగానే.. సభలో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లును మూజువాణి ఓటు ద్వారా సభ అమోదించిది. అయితే ఆందోళనలు ఎంతకీ ఆగకపోవడం వల్ల సభను రేపు ఉదయం 11గంటలకు వాయిదా వేశారు.
ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 బిల్లు ద్వారా…ఇక నుంచి ఓటు రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారి నుంచి ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఆధార్ నెంబర్ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవసరం అవుతుందని కేంద్రమంత్రి రిజిజు తెలిపారు. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని మంత్రి తెలిపారు.
అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఆధార్ చట్టం ప్రకారం ఆధార్ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆధార్ను కేవలం అడ్రస్ ప్రూఫ్గా వాడారని, కానీ అది పౌరసత్వ ద్రవీకరణ పత్రం కాదు అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ఓటర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు.
ALSO READ CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్