TS High court : 10 మంది న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేయించారు.
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 10మంది న్యాయమూర్తులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేయించారు. కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్.శ్రావణ్ కుమార్ వెంకట్,గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్రెడ్డి, దేవరాజ్ నాగార్జున్లు ప్రమాణస్వీకారం చేశారు.
మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. కొత్తగా 10మంది ప్రమాణస్వీకారం చేయటంతో మొత్తం న్యాయమూరతుల సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి. ఈ 10మంది న్యాయమూర్తుల్లో నలుగురు మహిళలు ఉండటం విశేషం. దీంతో ఈ హైకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కి చేరనుంది. మొత్తం న్యాయమూర్తుల్లో మహిళల శాతం 34.48%కి పెరుగుతుంది.
కాగా..న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరగటంతో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన జరుగనుంది. ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం తరువాత పలు కోర్టులో న్యాయమూర్తుల భర్తీ జరుగుతోంది. గతంలో న్యాయమూర్తుల కొరతగా ఉందని పలువురు న్యాయమూర్తులు సమావేశాల్లోవాపోయిన సందర్భాలున్నాయి.