Vice Presidential Polls: విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు టీఎమ్‌సీ దూరం

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్‌సీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్‌సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ గురువారం వెల్లడించారు.

Vice Presidential Polls: విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు టీఎమ్‌సీ దూరం

Vice Presidential Polls

Vice Presidential Polls: రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్‌సీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్‌సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ గురువారం వెల్లడించారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఎంపీలతో గురువారం సమావేశమయ్యారు.

Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి

అనంతరం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. విపక్షాల అభ్యర్థిగా ఉన్న మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసేముందు ప్రతిపక్షాలు తమను సంప్రదించకపోవడంతో టీఎమ్‌సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి మార్గరెట్ ఆల్వాతో మమతకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, ఈ విషయంలో ముందుగా తమ పార్టీ అభిప్రాయం అడగకపోవడం మమతకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో ఆమె ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఎన్సీపీలపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి ఎంపిక తమను సంప్రదించకుండా జరిగిందని, ఈ పద్ధతి సరికాదని టీఎమ్‌సీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. గత ఆదివారం మార్గరెట్ ఆల్వా ఎంపిక జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిపి మొత్తం 18 పార్టీలు సమావేశమై ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే, ఇందులో టీఎమ్‌సీకి ఆహ్వానం అందలేదు.

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ టీఎమ్‌సీ. ఈ పార్టీకి లోక్‌సభలో 23 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 53 మంది ఎంపీలు ఉంటే, తమిళనాడుకు చెందిన డీఎమ్‌కేకు 24 మంది ఎంపీలు ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎక్కువ మంది ఎంపీలున్న టీఎమ్‌సీ తప్పుకోవడం ఆ కూటమికి ఎదురుదెబ్బే. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలి అని కోరేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నా మమతా బెనర్జీ అందుబాటులోకి రావడం లేదు.