Lottery : అదృష్టం అంటే వీరిదే…లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న తమిళనాడు వాసులు

అదృష్టం ఉండాలే కానీ మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.

Lottery : అదృష్టం అంటే వీరిదే…లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న తమిళనాడు వాసులు

Kerala Lottery

Lottery : అదృష్టం ఉండాలే కానీ మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.

తమిళనాడు, కన్యాకుమారికి చెందిన డాక్టర్ ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్ లకు   కేరళ లాటరీలో రూ. 10 కోట్లు బహుమతి వచ్చింది.  వీరిద్దరూ కొద్ది రోజుల   క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువెళ్లేందుకు తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు.  ఆ సమయంలో కేరళలో విషు బంపర్ లాటరీ టికెట్ సీజన్ నడస్తోంది.   ఆ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విమానాశ్రయంలో లాటరీ టికెట్లు అమ్ముతున్న రంగన్, అతని భార్య జసీంత వద్ద లాటరీ టికెట్ కొన్నారు.

ఈనెల 22న తీసిన డ్రాలో  వారు కొన్న లాటరీ  నెంబర్  పై జాక్ పాట్ తగిలింది. వీరు కొన్న లాటరీ టికెట్ కు రూ.10కోట్ల బంపర్ లాటరీ తగిలింది. ఈక్రమంలో లాటరీ నిర్వాహకులు వారిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్ కు వచ్చి    టికెట్‌తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించారు.  విధి.. విధానాలు పూర్తయిన తర్వాత వారి ఖాతాకు లాటరీ సంస్ధ బహుమతి రూ. 10 కో్ట్లు జమ చేయనుంది.