Smriti Irani: కేజ్రీవాల్జీ.. ఇలాంటి వ్యక్తిని మంత్రి పదవిలో కొనసాగిస్తారా?: స్మృతి ఇరానీ
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్పై పెట్టిన కేసులు అన్నీ నకిలీవేనని, రాజకీయ కుట్రలో భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు.
Smriti Irani: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్పై పెట్టిన కేసులు అన్నీ నకిలీవేనని, రాజకీయ కుట్రలో భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ”రూ.16.39 కోట్ల నగదు అక్రమ చలామణీ కేసులో తాను ఉన్నట్లు సత్యేందర్ జైన్ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం-2016 కింద వివరాలు తెలిపారా? లేదా? ఈ వ్యవహారంలో అంకుశ్ జైన్, వైభవ్ జైన్ కూడా ఉన్నట్లు ఆయన చెప్పలేదా?” అని స్మృతి ఇరానీ నిలదీశారు.
Pakistan: పాక్ ప్రజలకు షాక్.. వంట నూనె ధర లీటరుకు రూ.208 పెంపు
అయితే, ఆ రూ.16.39 కోట్లు అంకుశ్ జైన్, వైభవ్ జైన్కు సంబంధించిన కావని, ఆ నల్లధనం సత్యేందర్ జైన్కు మాత్రమే చెందినదని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ స్పష్టం చేసింది నిజం కాదా? అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. సత్యేందర్ జైన్కు కేరళలోని ఓ ప్రాంతంలో, చెన్నైలో, నిజాంపూర్లో, వాయవ్య ఢిల్లీలో 20 ఎకరాల భూమి ఉన్నది నిజమేనా? కాదా? అని ఆమె నిలదీశారు. ఆ భూముల చుట్టూ ఉన్న అక్రమ కాలనీలను క్రమబద్ధీకరించలేదా? అని ఆమె అడిగారు. ఇటువంటి వ్యక్తిని మంత్రి పదవిలో కొనసాగిస్తారా? అని కేజ్రీవాల్ను స్మృతి ఇరానీ నిలదీశారు.