Veera Simha Reddy: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న వీరసింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహా రెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఇక బాలయ్యను మరోసారి పవర్ఫుల్ పాత్రలో చూడటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహా రెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఇక బాలయ్యను మరోసారి పవర్ఫుల్ పాత్రలో చూడటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.
Veera Simha Reddy : వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ గ్యాలరీ..
ఈ సినిమా కమర్షియల్గా కూడా మంచి వసూళ్లు రాబట్టి బాలయ్య కెరీర్లో మరో సాలిడ్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో బాగా ఎంజాయ్ చేసిన అభిమానులు, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘వీరసింహారెడ్డి’ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
Veera Simha Reddy : హనీ రోజ్తో సిప్ వేస్తున్న బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!
వీరసింహారెడ్డి మూవీని ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుండి డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామలు శ్రుతి హాసన్, హనీ రోజ్లు హీరోయిన్లుగా నటించగా, గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ను అందిస్తారో చూడాలి.