Vishal : తిరుమలకు హీరో విశాల్.. రోజాతో కలిసి సినిమా ప్రమోషన్

తమిళ హీరో విశాల్‌ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి అలిపిరి నుంచి కాలినడకన విశాల్ తిరుమల చేరుకున్నారు. ఈ దారిలో కొంతమంది సెల్ఫీలు అడగగా వారికి సెల్ఫీలు

Vishal : తిరుమలకు హీరో విశాల్.. రోజాతో కలిసి సినిమా ప్రమోషన్

Vishal

Vishal :  తమిళ హీరో విశాల్‌ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి అలిపిరి నుంచి కాలినడకన విశాల్ తిరుమల చేరుకున్నారు. ఈ దారిలో కొంతమంది సెల్ఫీలు అడగగా వారికి సెల్ఫీలు ఇచ్చాడు. నిన్న రాత్రే తిరుమలకి చేరుకున్నాడు. ఇవాళ ఉదయం విఐపి దర్శన సమయంలో విశాల్ శ్రీ వారిని దర్శించుకున్నాడు. విశాల్ తో పాటు నటుడు రమణ కూడా ఉన్నారు. ఈ దర్శన సమయంలో రోజాని కలిశారు. దర్శనానంతరం రోజా, విశాల్ కలిసి బయటకి వచ్చారు. వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

Rajashekar : సంక్రాంతి బరిలో రాజశేఖర్? స్టార్ హీరోలతో పోటీ?

విశాల్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను. కాలినడకన దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నాను. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు అని తెలిపారు. దీపావళికి ‘ఎనిమీ’ చిత్రం విడుదల అవుతుంది. ఆ సినిమా విజయం సాధించాలని స్వామి వారిని కోరుకున్నాను అని అన్నారు. అలాగే కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణం చాలా బాధించింది. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు ఉంది. అందుకే అతను చేసిన అనేక మంచి పనుల్లో నేను ఒకటి చెయ్యాలి అనుకున్నా. పిల్లల చదువులు ఆపకూడదు అని ఇల్లు కట్టుకోవడం కోసం దాచుకున్న డబ్బులతో పిల్లలను చదివించాలని నిర్ణయం తీసుకున్నా ఇల్లు వచ్చే సంవత్సరం కొనుక్కోవచ్చు, పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని హీరో విశాల్‌ మీడియాతో తెలిపారు. రోజా కూడా విశాల్ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

Puneeth Rajkumar : పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి

ఇదే విఐపి దర్శన సమయంలో విశాల్, రోజాలతో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా, తమిళనాడు మంత్రులు ఎం.ఆర్.కె.పన్నీర్ సెల్వం, ఎం.పీ.స్వామినాథన్ లు స్వామి వారిని దర్శించుకున్నారు.