ఇంటర్నేషనల్ ఇడ్లీ డే : ఇడ్లీ తినటంలో బెంగళూరే టాప్
ఢిల్లీ: ‘ఇడ్లీ’ అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేదీ..ఆరోగ్యవంతమైనది ఇడ్లీ. అన్నింటికీ ఓ రోజు ఉన్నట్లే ‘ఇడ్లీ’కి కూడా ఓ రోజు ఉంది. అదే మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం. తేలిగ్గా జీర్ణం అయ్యే ఇడ్లీలో ఎన్నో పోషకాలు ఉంటాయని న్యూట్రీషియన్స్ సూచిస్తుంటారు.
మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా..గోధుమ రవ్వ లేదా రాగిపిండితో చేసిన ఇడ్లీల ద్వా రా ఆరోగ్యంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతారు. ‘ఉబెర్ ఈట్స్’ అనే సంస్థ అల్పాహారం విషయంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీ తీసుకునే నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచినట్లు ‘ఉబెర్ ఈట్స్’ అనే సంస్థ తెలిపంది. ఈ జాబితాలో ముంబై రెండోస్థానం..చెన్నై మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఉదయం 7.30–11.30 సమయంలో అత్యధిక సంఖ్యలో ఇడ్లీ కోసం ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. మార్చి 10న దేశమంతటా అత్యధిక సంఖ్యలో ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.
Read Also : కళ్యాణ వైభోగం : 15 మంది ట్రాన్స్జెండర్ల వివాహం
వెరైటీ ఇడ్లీలపై ఇండియన్స్ మక్కువ
ఇడ్లీలంటే భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగానూ మక్కువ ఎక్కువేనని సర్వే తేల్చింది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ, బ్రిటన్లోని లండన్ వాసులు ఇడ్లీలను లాగించేస్తున్నారని ఉబెర్ ఈట్స్ వెల్లడించింది. వెరైటీ వెరైటీ ఇడ్లీలు తయారు చేయటంలోను..తినటంలోను భారతీయులు ఏమాత్రం తగ్గటంలేదట.తమిళనాడులోని కోయంబత్తూరు వాసులు చికెన్ఫ్రై ఇడ్లీ అంటే పడి ఛస్తున్నారు. తిరుచినాపల్లి వాసులు ఇడ్లీ మంచూరియాను, నాగ్పూర్ నగర వాసులు చాకోలెట్ ఇడ్లీపై మనసు పారేసుకున్నారని సర్వే వెల్లడించింది.
కొంచెం చట్నీ, కారంపొడి, సాంబార్ ఎక్కువగా వేయాల్సిందిగా చాలామంది వినియోగదారులు కోరారనీ..ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉన్న మరికొందరు వినియోగదారులు వెజిటబుల్ ఇడ్లీని ఆర్డర్ చేశారని ఉబెర్ ఈట్స్ తెలిపింది. ‘ఇడ్లీ ప్రియులు అత్యధికంగా ఉన్న నగరంగా బెంగళూరు అవతరించడం నిజంగా సంతోషకరమైన విషయమని అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని గత మూడేళ్లుగా జరుపుతున్న సందర్భంగా ‘ఉబెర్ ఈట్స్‘ సంస్థ నిర్వహించిన సర్వే తెలిపింది.
Read Also : ‘నాసా’ బంపర్ ఆఫర్ : ‘నిద్ర’ ప్రియులకు లక్షలిస్తాం