చిరంజీవితో మాత్రమే.. ఇదే చివరిసారి.. ఇంకెప్పుడు చెయ్యను!

  • Published By: vamsi ,Published On : March 9, 2020 / 09:42 AM IST
చిరంజీవితో మాత్రమే.. ఇదే చివరిసారి.. ఇంకెప్పుడు చెయ్యను!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటీనటులు అయితే ఆయన సినిమాలో నటించాలని ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి అయినా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ని చిరంజీవే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అనౌన్స్ చేశారు. 

ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా కస్సాండ్రా ఓ ఐటెం సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసింది.

ఈ సాంగ్ గురించి రెజీనా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అని వెల్లడించింది. చిరంజీవిగారు నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించాను. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది చేస్తారా అని ఆచార్య టీం నాకు ఫోన్ చేసినప్పుడు మరో క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చేసేసాను అని చెప్పుకొచ్చింది రెజీనా. 

అందుకు కారణం చిరంజీవి గారే అని చిరంజీవి గారితో కలిసి స్టెప్పులు వెయ్యడం కంటే లక్ ఏముంటుంది అనే ఉద్ధేశ్యంతోనే ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంక ఎవరితో కూడా రాబోయే రోజుల్లో కూడా స్పెషల్ సాంగ్ కోసం అస్సలు ఒప్పుకోను అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఈ పాటను రాత్రి వేళల్లోనే చిత్రీకరించారని, ఇందుకోసం ఆరు రోజులు కాల్‌షీట్స్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు.

See Also | కావేరి కళ్యాణి కొత్త ఆరంభం..