ఆది అన్నయ్యతో అఖిల్ సినిమా

మిస్టర్ మజ్నుతర్వాత పెద్ద గ్యాప్ ఏమీ తీసుకోకుండా తన నాలుగవ సినిమాని లైన్‌లో పెట్టేసాడు అఖిల్.

  • Published By: sekhar ,Published On : February 7, 2019 / 02:03 PM IST
ఆది అన్నయ్యతో అఖిల్ సినిమా

మిస్టర్ మజ్నుతర్వాత పెద్ద గ్యాప్ ఏమీ తీసుకోకుండా తన నాలుగవ సినిమాని లైన్‌లో పెట్టేసాడు అఖిల్.

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను.. జనవరి 25న రిలీజ్ అయిన మజ్నుకి మొదటిరోజు ఫ్యాన్స్, యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు కానీ, తర్వాత ఎక్కడా చడీ చప్పుడు లేకుండా పోయింది. అఖిల్, హలో సినిమాలతో పోలిస్తే, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మిస్టర్ మజ్ను, హీరోగా అఖిల్‌కి కాస్త ఊరటనిచ్చిన సినిమా అనుకున్నా, పాపం నిరాశ తప్పలేదు. గతకొద్ది రోజులుగా అఖిల్ తర్వాతి సినిమా శ్రీను వైట్లతో అనీ, క్రిష్‌తో అనీ వార్తలొచ్చాయి. ఇప్పుడు పెద్ద గ్యాప్ ఏమీ తీసుకోకుండా తన నాలుగవ సినిమాని లైన్‌లో పెట్టేసాడు అఖిల్. 

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి పెద్ద కొడుకు సత్య ప్రభాస్ డైరెక్షన్‌లో, అఖిల్ సినిమా చెయ్యనున్నాడు. యంగ్ హీరో ఆది పినిశెట్టికి ప్రభాస్ స్వయానా అన్నయ్య. ఆది హీరోగా నటించిన మలుపు సినిమాతో ప్రభాస్ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ ఇప్పటికే అఖిల్ కోసం మంచి కథ రెడీ చేసాడట. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.