Prabha-Ram Charan: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరో క్రేజీ భారీ మల్టీస్టారర్?

టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగింది. మన హీరోలు ఇండియన్ సినిమాను దున్నేస్తున్నారు. ఇన్నాళ్లు అరాకొరా డబ్బింగ్ సినిమాలతోనే ఇతర భాషల్లో బండి లాగించిన

Prabha-Ram Charan: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరో క్రేజీ భారీ మల్టీస్టారర్?

Prabha Ram Charan

Prabha-Ram Charan: టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగింది. మన హీరోలు ఇండియన్ సినిమాను దున్నేస్తున్నారు. ఇన్నాళ్లు అరాకొరా డబ్బింగ్ సినిమాలతోనే ఇతర భాషల్లో బండి లాగించిన హీరోలు ఇప్పుడు ఇండియన్ సినిమా మార్కెట్ ను ఒడిసిపట్టేసుకున్నారు. ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్ సబ్జెక్టులతో తెలుగు సినిమాను ఇండియన్ సినిమాలుగా మార్చేశారు. దీంతో బాలీవుడ్ హీరోలు, ఇతర బాషా నటులు కూడా మన సినిమాలో కనిపించేందుకు యమా ఆసక్తిగా ఉంటున్నారు.

ఇప్పటికే దేశమంతా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ప్రాజెక్ట్ Kలతో ఎటు చూసినా దేశమంతా తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు మొదలైనట్లుగా ఓ ఆసక్తికర కథనం ఒకటి చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లు హీరోలుగా ఓ మల్టీస్టారర్ కు ప్లాన్ జరుగుతుందట.

మూవీ క్రియేషన్స్ అంటే ఇండస్ట్రీలో ప్రభాస్ సొంత నిర్మాణసంస్థగా పేరు. ప్రభాస్ స్నేహితులు, సన్నిహితులదైన యూవీ సంస్థ మిర్చి, సాహో సినిమాలను నిర్మించగా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను ఆ తర్వాత మరో మూడు సినిమాలను కూడా మరికొందరితో కలిసి నిర్మించనున్నారు. కాగా, మూవీ సంస్థ రామ్ చరణ్ నటించిన రంగస్థలం, వినయవిధేయ సినిమాలను డిస్టిబ్యూట్ చేశారు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు ఈ ఇద్దరితో మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఓ యంగ్ దర్శకుడితో ఈ మల్టీస్టారర్ కోసం చర్చలు జరుపుతుండగా త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.