Akhanda : అప్పన్న సన్నిధిలో ‘అఖండ’.. విశాఖలో విజయోత్సవ సభ

వైజాగ్ లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు 'అఖండ' విజయోత్సవ జాతర నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయమే బాలకృష్ణ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం ముందుగా సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని...

Akhanda : అప్పన్న సన్నిధిలో ‘అఖండ’.. విశాఖలో విజయోత్సవ సభ

Balayya (1)

Akhanda :  బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ‘అఖండ’ భారీ విజయం సాధించడంతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. బాలయ్య ఉగ్ర రూపం, బోయపాటి మాస్ టేకింగ్, తమన్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. దేశ విదేశాల్లోనూ అఖండ భారీ విజయం సాధించింది. దీంతో ‘అఖండ’ టీం ఇవాళ విజయోత్సవ సభని ఏర్పాటు చేశారు.

C.Kalyan : సినీ పరిశ్రమని చంపొద్దంటూ నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలు

వైజాగ్ లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ‘అఖండ’ విజయోత్సవ జాతర నిర్వహించనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. దీంతో ఇవాళ ఉదయమే బాలకృష్ణ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం ముందుగా సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. బాలయ్యతో పాటు బోయపాటి, సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు.

Bigg Boss Priyanka : బిగ్‌బాస్‌ లో ప్రియాంక రెమ్యునరేషన్ ఎంత??

బాలయ్య మాట్లాడుతూ… ‘అఖండ’ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. అందుకే ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసేందుకు వచ్చాము. చాలా రోజుల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు ప్రేక్షకులు. ఘన విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఇది మా ఒక్కరి విజయం కాదు. చిత్ర పరిశ్రమ విజయం అని అన్నారు. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సినిమాను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని తెలిపారు. అనంతరం సింహాచలం నుంచి కార్ లో వైజాగ్ వెళ్లారు.