రోజాతో బండ్ల గణేష్.. వైరల్ అవుతున్న పిక్..
Roja-Bandla Ganesh: రోజా, బండ్ల గణేష్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు విషెస్ చెబుతూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య కొన్ని నెలల క్రితం మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్లో వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో వ్యక్తిగతంగా ఒకరినొకరు తిట్టుకున్నారు కూడా. నా దేవుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావా అంటూ రోజాపై విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్. ఆ ఇద్దరూ అంతా సైలెంట్ అయిపోయారు.
కట్ చేస్తే.. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన రోజా, బండ్ల గణేష్ హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోను తన ట్విట్టరలో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. ‘‘చాలాకాలం తర్వాత రోజా గారిని కలిశాను. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలి. ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నా..’’ అంటూ ట్వీట్ చేశాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ శ్వాశత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అని పెద్దవాళ్లు చెప్పిన మాట నిజమే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
After long time I met @RojaSelvamaniRK god bless with Successful career and good health and wealth? pic.twitter.com/gGO4WSBmcE
— BANDLA GANESH. (@ganeshbandla) October 30, 2020