Chiranjeevi : బాలయ్య సినిమా, నా సినిమా.. రెండిటికి ఎలా న్యాయం చేయాలో నిర్మాతలకి తెలుసు..

తాజాగా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి, రవితేజ, ఊర్వశి రౌతేలా, డైరెక్టర్ బాబీ, దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, నిర్మాతలు.. చిత్రయూనిట్ అంతా విచ్చేసి మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న.................

Chiranjeevi : బాలయ్య సినిమా, నా సినిమా.. రెండిటికి ఎలా న్యాయం చేయాలో నిర్మాతలకి తెలుసు..

Chiranjeevi comments on sankranthi movies

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మరింత యంగ్ గా, మరింత ఎనర్జీగా కనిపిస్తుండం, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

తాజాగా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి, రవితేజ, ఊర్వశి రౌతేలా, డైరెక్టర్ బాబీ, దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, నిర్మాతలు.. చిత్రయూనిట్ అంతా విచ్చేసి మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి చిరంజీవి సినిమాతో పాటు బాలయ్య సినిమా వీరసింహ రెడ్డి కూడా రిలీజ్ కానుంది. ఈ రెండిటికి నిర్మాతలు ఒకరే కావడం విశేషం. మొదటిసారి టాలీవుడి లో ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు సంక్రాంతికి, అది కూడా పెద్ద హీరోల సినిమాలు రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!

దీనిపై చిరంజీవి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రెండు సినిమాలు నిర్మాతలకి రెండు కళ్లలాంటివి. ఒక కన్ను పొడిచేసుకోరుగా, రెండిటిని సమంగా చూస్తారు. వాళ్ళే ముందుండి నడిపిస్తారు. ఏ సినిమాకి అన్యాయం చెయ్యరు. సంక్రాంతికి రిలీజయ్యే ఈ రెండు సినిమాలకి ఎలాంటి న్యాయం చేయాలో వాళ్లకి తెలుసు అని అన్నారు.