Dil Raju : ‘వారసుడు’ సినిమా మహేష్, చరణ్‌లను దాటి విజయ్‌కి వెళ్ళింది.. దిల్ రాజు!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి తమిళ సినిమా 'వారిసు', తెలుగులో 'వారసుడు'. 2023 సంక్రాంతి బరిలో ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. దీంతో దిల్ రాజు తెలుగులో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే...

Dil Raju : ‘వారసుడు’ సినిమా మహేష్, చరణ్‌లను దాటి విజయ్‌కి వెళ్ళింది.. దిల్ రాజు!

dil raju says varisu movie first choice mahesh and charan

Dil Raju : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి తమిళ సినిమా ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’. కోలీవుడ్ హీరో ఇళయ దళపతి విజయ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా రాబోతుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2023 సంక్రాంతి బరిలో ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది.

Dil Raju: దిల్‌రాజుపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం..

దీంతో నిర్మాత దిల్ రాజు తెలుగులో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో.. ‘వారసుడు మూవీకి తెలుగులో ఎవరు సెట్ అవ్వరా, తమిళ హీరోని ఎందుకు తీసుకున్నారు’ అనే ప్రశ్నకు దిల్ రాజు బదులిచ్చాడు. “ఈ సినిమా కథని మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాము, కానీ డేట్స్ సర్దుబాటు కాక ఆయనతో కుదరలేదు. ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా కథ వినిపించాము. అయితే చరణ్ డేట్స్ నా సినిమా ‘RC15’తోనే క్ల్యాష్ అవుతుండడంతో.. నేను ఈ కథకి హీరో కోసం విజయ్ గారిని కలవడం జరిగింది” అంటూ వెల్లడించాడు.

రామ్ చరణ్, మహేష్ బాబులను దాటి వెళ్లిన కథ. విజయ్ కి విజయాన్ని ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. కాగా ఈ సినిమాకి థియేటర్ల సమస్య కేవలం టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లోని ఎదురయ్యింది. సంక్రాంతికే తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా విడుదల కూడా ఉండడంతో, ‘వారిసు’కి కావాల్సినన్ని థియేటర్లు దొరకలేదట. దీంతో రేపు దిల్ రాజు తమిళనాడు వెళ్లనున్నట్లు తెలియజేశాడు.