Janhvi Kapoor : రొమాంటిక్ సినిమాలు చేయడానికి రెడీ అంటున్న జాన్వీ..
ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ''ధడక్ సినిమా తర్వాత మంచి రొమాంటిక్ సినిమాల్లో చేయాలనుకున్నాను. కానీ నాకు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలే............
Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ కపూర్. తన తల్లి మరణం తర్వాత ధఢక్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కాస్త పర్వాలేదనిపించినా ఆ తర్వాత గుంజన్ సక్సేనా సినిమాతో అందర్నీ మెప్పించింది జాన్వీ. అయితే వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది జాన్వీ. ‘గుంజన్ సక్సేనా’, ‘రుహి మిలి’, ‘గుడ్లక్ జెర్రీ’ లాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఉన్నా ఇవి మహిళా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ రొమాంటిక్ సినిమాలు చేయాలని ఉంది అని తన మనసులో మాట బయట పెట్టింది.
ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ”ధడక్ సినిమా తర్వాత మంచి రొమాంటిక్ సినిమాల్లో చేయాలనుకున్నాను. కానీ నాకు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలే వస్తున్నాయి. ఇక వచ్చిన వాటిల్లో బెస్ట్ అనిపించినవి తీసుకొని గుంజన్ సక్సేనా లాంటి సినిమాలు చేశాను. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటే బోర్ కొడుతుంది. మళ్లీ ఇలాంటి సినిమాలు చేయాలని లేదు. భవిష్యత్తులో రొమాంటిక్ డ్రామా ఉన్న సినిమాల్లో చేయాలి అనుకుంటున్నాను. ఇకనుంచి రొమాంటిక్ సినిమాలే ఒప్పుకుంటాను” అని తెలిపింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది జాన్వీ. ఇక రొమాంటిక్ సినిమాలు చేస్తా అని బహిరంగంగానే ప్రకటించడంతో సినిమాల్లో ఏ రేంజ్ లో రెచ్చిపోయి తన అందాలని పరుస్తుందో చూడాలి మరి. జాన్వీలోని రొమాంటిక్ యాంగిల్ ని ఏ డైరెక్టర్ బయటకి తీయనున్నాడో?