Adipurush : జానకి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసింది
‘ఆదిపురుష్’ లో జానకిగా కనిపించనున్న కృతి సనన్కి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది..
Adipurush: రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’.. డార్లింగ్ ఈ మూవీతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్, భీముడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.
Adipurush : షూటింగ్ పూర్తి చేసిన సైఫ్ అలీ ఖాన్..
పక్కా ప్లానింగ్తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన ఓం రౌత్ షూటింగ్ జెట్ స్పీడ్తో చేస్తున్నారు. వారం రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ తన పోర్షన్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేశారు. రీసెంట్గా కృతి సనన్ కూడా తన పార్ట్ షూట్ పూర్తి చేసేసింది. ఈ సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించి ఘనంగా సెండాఫ్ ఇచ్చింది ‘ఆదిపురుష్’ టీమ్.
Kajol – Revathi : రేవతి దర్శకత్వంలో కాజోల్
జానకి పాత్రలో నటిస్తున్న కృతి ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయింది. ఆమె కెరీర్లో ‘ఆదిపురుష్’ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుందని మేకర్స్ చెప్పారు. మిగతా షూటింగ్ను కూడా అనుకున్న సమాయానికి పూర్తి చేసి.. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని ఒక గ్రాండ్ విజువల్ వండర్ను ‘ఆదిపురుష్’ రూపంలో 2022 ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
View this post on Instagram