వైరల్ అవుతున్న చై, సామ్ పిక్స్..
Naga Chaitanya-Samantha: టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంతల లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ జంట క్యూ త్రీ వెంచర్స్కు సంబంధించిన Tree view smart TV ను Launch చేశారు. 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు వివిధ సైజులలో ఉన్న ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని మంగళవారం చై, సామ్ కలిసి విడుదల చేశారు.
అనంతరం కంపెనీ టీవీ మోడల్స్ గురించి వివరించారు. వాయిస్ రిమోట్ ఆప్షన్తో రాబోతున్న ఈ టీవీ ఇండియన్ మార్కెట్లో కచ్చితంగా సక్సెస్ అవుతుందని సమంత, నాగచైతన్య అన్నారు. రానా పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి కనిపించడంతో ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో అక్కినేని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.