OTT లో లక్ష్మీబాంబ్ ఫిల్మ్ ..నవ్వడంతో పాటు భయపడుతారు
కరోనా రాకాసితో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు ఇంక తెరుచుకోవడం లేదు. ఇప్పటికే పూర్తయిన సినిమాలు విడుదల కావడం లేదు. ఈ కరోనా టైంలో OTT సేఫ్ అంటున్నారు. ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది.
ఆయన నటించిన న్యూ ఫిల్మ్ లక్ష్మీ బాంబ్ విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్ ఏకంగా రూ. 125 కోట్లతో దక్కించుకుందని తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
Entertainment ka Bomb phatne wala hai. Are you ready? Dekhiye First Day First Show of #LaxmmiBomb on @DisneyplusHSVIP . #DisneyPlusHotstarMultiplex@advani_kiara @TusshKapoor @offl_Lawrence @Shabinaa_Ent @foxstarhindi pic.twitter.com/cKonUslx6A
— Akshay Kumar (@akshaykumar) August 1, 2020
దర్శకుడు, రాఘవ లారెన్స్ మునికి సీక్వెల్ గా సిరీస్ లు తీస్తున్న సంగతి తెలిసిందే. కాంచన సిరీస్ ల్ మంంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే కాంచన – 3 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఇతర భాషల్లో ఈ సినిమాలను రీమెక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
తుషార్ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించారు. హారర్ – కామెడీ నేపథ్యంలో సినిమా రూపొందింది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మే 27న సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోన వైరస్ కారణంగా..థియేటర్లు మూసివేయడంతో..రిలీజ్ ను వాయిద వేసుకున్నారు. చివరకు ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫాంపై విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు స్వయంగా అక్షయ్, కియారా..సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ఫస్ట్ డే ఇంట్లోనే చూడవచ్చు. రెండు విషయాల్లో గ్యారెంటీ ఇస్తున్నా..నవ్వడంతో పాటు భయపడుతారు అంటున్నరు అక్షయ్. త్వరలోనే మీ ఇంట్లో బాంబ్ పేలనుందని, మొదటి షో మీ ఇంట్లోనే DisneyPlusHSVIPలో అలరించనుంది అని వెల్లడించారు.