Evaru Meelo Koteeswarulu : తారక్ షో కి గెస్ట్గా మహేష్ బాబు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు..
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది.. మామూలుగా ఉండదు కదా.. ఇంతకుముందు ‘భరత్ అనే నేను’ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చాడు తారక్. ఆ ఈవెంట్లో మహేష్ – ఎన్టీఆర్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు.
Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…
ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి సందడి చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ మరోసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో తో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా వచ్చి అలరించారు. ఆ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్పీ సాధించింది.
SIIMA Awards 2019 : సైమా (తెలుగు) విజేతలు వీళ్లే..
ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కి అతిథిగా రాబోతున్నారు. దసరా స్పెషల్గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 19)న దీనికి సంబంధించిన షూటింగ్లో మహేష్ పాల్గొనబోతున్నారని సమాచారం. పండుగ రోజు ఇద్దరు హీరోలు కలిసి బుల్లితెర మీద సందడి చెయ్యనుండడంతో ఈ స్పెషల్ ఎపిసోడ్పై హైప్ క్రియేట్ అయింది. ఇక టీఆర్పీ రికార్డ్స్ నమోదు చెయ్యడం పక్కా అంటున్నారు మహేష్ అండ్ తారక్ ఫ్యాన్స్..
Sarkaru Vaari Paata : మెగా బ్రదర్స్ మహేష్ని బీట్ చెయ్యలేదంట..!