SSMB28: మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ లాల్!

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. అది కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మొదలు..

SSMB28: మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ లాల్!

Ssmb28

SSMB28: ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. అది కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మొదలు పెట్టనున్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాని మే 1న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. వెంటనే మహేష్ తర్వాతి సినిమా కూడా ప్రారంభమవుతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అడిషన్.. ఎగ్జైట్మెంట్‌లో ఫ్యాన్స్!

ఈమధ్యనే రామానాయుడు స్టూడియోలో ముహూర్తం కార్యక్రమం కూడా నిర్వహించగా.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈలోగా త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెడుతున్నారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు మరో కీలక పాత్ర కూడా ఒకటి ఉంటుందట. ఈ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాతో సినిమాకి వెయిట్ పెంచిన మోహన్ లాల్ అయితే ఈ పాత్రకి బాగుటుందని మేకర్స్ ఆయనని ఒప్పించారు.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

మోహన్ లాల్ పాత్ర పవర్ ఫుల్ మాత్రమే కాదు.. ఇది ఓ పొలిటికల్ లీడర్ పాత్రగా తెలుస్తుంది. ఇందులో మోహన్ లాల్ సీఎంగా కూడా కనిపించనున్నారని తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఇది పొలిటికల్ కథాంశంతో తెరకెక్కే సినిమానే అని బలంగా వినిపిస్తుంది. కాగా, అతడు, ఖలేజా సినిమా తర్వాత 11 సంవత్సరాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కావడంతో దీనిపై మహేష్ అభిమానులలో భారీ అంచనాలున్నాయి.