MAA Elections: ‘మా’లో కొందరు బజారున పడి నవ్వుల పాలవుతున్నారు -మోహన్ బాబు
‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న తన కొడుకు మంచు విష్ణు ప్యానెల్కి ఓటేసి గెలిపించాలని కోరారు సీనియర్ హీరో మోహన్ బాబు
MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న తన కొడుకు మంచు విష్ణు ప్యానెల్కి ఓటేసి గెలిపించాలని కోరారు సీనియర్ హీరో మోహన్ బాబు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యతయని, ఎవరికి ఏ సమస్య వచ్చినా విష్ణు పక్కనే ఉంటాడన్నారు.
తెలుగువాళ్లు అందరూ ఒక్కటిగా ఉండాలనే సంకల్పంతో మా అసోసియేషన్ పెట్టామని, ప్రస్తుతం ‘మా’లో గొడవలు చూస్తుంటే బాధేస్తుందని, గతంలో ఏకగ్రీవం చేసుకుందామని అప్పటి పెద్దలు కోరుకునేవారని, ఇఫ్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’లోనే కొందరు సభ్యులు బజారున పడి నవ్వుల పాలవుతున్నారని అన్నారు మోహన్ బాబు.
ఇటువంటి పరిస్థితి చూస్తుంటే, మనసుకు చాలా కష్టంగా ఉందని, ఎవరు ఎన్ని చేసినా “మా” అంతా ఒక కుటుంబమని అన్నారు. మనస్సాక్షితో ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. మంచు విష్ణు.. “మీ” “మా” కుటుంబంలో బిడ్డ.. విష్ణు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారనే నమ్మకం మాకుంది.
మంచు విష్ణుకి అతని ప్యానెల్కీ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. గెలిచిన వెంటనే రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కలసి వారి సహకారం తీసుకుని సినిమా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మా ఎన్నికలు అక్టోబరు 10న అంటే రేపు జరగనున్నాయి. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.