దర్బార్ యూనిట్‌పై ‌దాడి : రాళ్ళు విసిరిన విద్యార్థులు

ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్‌లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది.. అక్కడ మూవీ యూనిట్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి మధ్య గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

  • Published By: sekhar ,Published On : May 2, 2019 / 11:18 AM IST
దర్బార్ యూనిట్‌పై ‌దాడి : రాళ్ళు విసిరిన విద్యార్థులు

ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్‌లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది.. అక్కడ మూవీ యూనిట్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి మధ్య గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న దర్బార్ షూటింగ్ ముంబాయిలో జరుగుతుంది. తలైవా పక్కన నయనతార తొలిసారి పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా థామస్ రజినీ కూతురుగా కనిపించనుంది. దర్బార్ షూటింగ్ స్పాట్‌‌లో తీసిన కొన్ని పిక్స్ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్‌లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది. అక్కడ మూవీ యూనిట్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి మధ్య గొడవ జరిగిందని, స్టూడెంట్స్ దర్బార్ టీమ్‌పై రాళ్ళతో దాడి చేసారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాలేజ్‌లో షూటింగ్ కావడంతో, షూటింగ్ చూసేందుకు స్టూడెంట్స్ ఎగబడ్డారనీ, వారిని కొంచెం దూరంగా ఉండమని మూవీ యూనిట్ చెప్పడంతో, స్టూడెంట్స్ వారితో వాదనకుదిగి, రాళ్ళతో దాడి చెయ్యగా, దర్శకుడు మురగదాస్ కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చెయ్యడంతోపాటు, లొకేషన్ మార్చాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి దర్బార్ టీమ్ నుండి అఫీషియల్‌గా ఎటువంటి ప్రకటన రాలేదు. 2020 సంక్రాంతికి దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.