Prabhas : ‘ప్రాజెక్ట్ K’పై నాగ్ అశ్విన్ ట్వీట్.. ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వను.. చాలా టైం ఉంది..

తాజాగా ఓ ప్రభాస్ అభిమాని గతంలో నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K' గురించి రాధేశ్యామ్ తర్వాత చెప్తాను అని పోస్ట్ చేసిన ట్వీట్ ని షేర్ చేసి.. ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్నా గుర్తున్నామా’ అంటూ...............

Prabhas : ‘ప్రాజెక్ట్ K’పై నాగ్ అశ్విన్ ట్వీట్.. ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వను.. చాలా టైం ఉంది..

Project K

Project K :  ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 500 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్, దిశా పాటని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు.

ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ సినిమా భారీ పరాజయం అవ్వగా అభిమానులంతా ప్రభాస్ నెక్స్ట్ సినిమాల గురించి, వాటి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ప్రభాస్ అభిమాని గతంలో నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ గురించి రాధేశ్యామ్ తర్వాత చెప్తాను అని పోస్ట్ చేసిన ట్వీట్ ని షేర్ చేసి.. ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్నా గుర్తున్నామా’ అంటూ నాగ్ అశ్విన్ ని ట్యాగ్ చేశాడు.

Balakrishna : మరోసారి బాలయ్య, తమన్ మాస్ బీట్.. జోడిగా ఖిలాడీ భామ

దీంతో ఈ ట్వీట్ కి నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ.. ”గుర్తున్నారు.. ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయింది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ కూడా పూర్తి అయింది. హీరో చాలా కూల్ గా ఉన్నారు. జూన్ చివరి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా, రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్రాజెక్ట్‌- K కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం” అని ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం సలార్, ఆది పురుష్ సినిమాలు రిలీజ్ అయ్యాక ‘ప్రాజెక్ట్ K’ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.