Dhanush : ఆ అమ్మాయి వల్లే జీవితం నాశనం.. మరోసారి వైరల్గా మారిన ధనుష్ వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు.
Dhanush first love story : తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు. ఆయన నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో విడుదల అవుతుంటాయి. ఈ ఏడాది తెలుగులో సార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న ధనుష్ ఇటీవల ఆమెకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు.
ధనుష్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తాను ఇంటర్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీ వెండితెర పై కాదా..? బుల్లితెర మీదనా..!
తాను పదో తరగతిలో ఉన్నప్పుడు బాగా చదివేవాడినని, క్లాస్లో ఎల్లప్పుడూ టాపర్గా ఉండేవాడినని చెప్పాడు. అయితే.ఇంటర్కు వచ్చే సరికి పరిస్థితి తారుమారైందన్నాడు. ఆ సమయంలో తాను ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలిపాడు. దీంతో అప్పటి నుంచి చదువు అటకెక్కిందన్నాడు. ఆ అమ్మాయితో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నానని, చదువును గాలికి వదిలివేసినట్లు చెప్పాడు. ఏదో అత్తెసరు మార్కులతో ఇంటర్ పాసైనట్లు వెల్లడించారు. ఆ అమ్మాయి వల్లే తన ఇంటర్ జీవితం నాశమైందని, లేకపోతే ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడిననంటూ సార్ సినిమా ప్రమోషన్స్లో ధనుష్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో నటిస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
Ram Charan : ప్రభాస్ ఛాలెంజ్ని స్వీకరించిన రామ్ చరణ్.. నెల్లూరు చేపల పులుసు..