అతడు తర్వాత అతడులో పేరే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో!
Trivikram Mahesh Movie: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అనగానే సినిమా సర్కిళ్లలో ఒక్కసారిగా భారీ అంచనాలు మొదలయ్యాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న మూడవ సినిమా ఇది. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఖలేజా సినిమా చేశారు త్రివిక్రమ్.. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్పైకి వెళ్లబోతుంది.
2005లో ఫస్ట్టైమ్ వీరిద్దరి కాంబినేషన్లో అతడు సినిమా రాగా.. వరుస ఫ్లాప్ల తర్వాత మహేష్ బాబుకు హిట్ దక్కింది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా మాత్రం థియేటర్లలో కలెక్షన్లు రాబట్టలేదు. ఇప్పుడు మూడవ సినిమాగా అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు పార్థు కాగా.. అతడు సినిమాలో పేరునే మూడవ సినిమాకు టైటిల్ కార్డ్గా పెట్టబోతున్నట్లు సినిమా వర్గాల్లో టాక్.
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ‘అల వైకుంఠపురములో’ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ అనే వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో ‘మహర్షి’లోనూ పూజానే హీరోయిన్. ఈ సినిమా టైటిల్ని మే 31న అఫిషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఈ సినిమాలో హీరో తండ్రి ఓ డాన్ అని, అది తెలియక హీరో కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేస్తాడని, తర్వాత అతడే తన తండ్రి అని తెలిశాక హీరో ఎలాంటి స్టేప్ తీసుకుంటానేది కథ సారాంశం అంటున్నారు.
డాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ని తీసుకోవాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. ఈ తండ్రీకొడుకుల వార్ను ఆసక్తికరంగా మలిచేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట.