Pawan Kalyan : అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.. పవన్ కళ్యాణ్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలియజేశాడు. భారత 53వ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఇక ఈ 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్”గా అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలోనే పవన్..

Pawan Kalyan : అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.. పవన్ కళ్యాణ్!

Pawan Kalyan congratulates chiranjeevi to getting Indian film personality of the year

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలియజేశాడు. భారత 53వ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి.ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 28 వరకు కొనసాగనుంది. ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హాజరయ్యారు.

Chiranjeevi : పవన్ రాజకీయాలకు తగినవాడు.. పాలిటిక్స్ గురించి మరోసారి మాట్లాడిన చిరంజీవి..

ఇక ఈ 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 150 పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవిని 2022 గాను “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్”గా ప్రకటించింది. ఈ క్రమంలోనే పవన్.. తనతో పాటు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం నిలుస్తున్న అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు.

“అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా నిన్న చిరంజీవి తన కాలేజీ ‘గెట్ టు గెథెర్’ ప్రోగ్రామ్ లో “పవన్ రాజకీయాలకు తగినవాడు” అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.