ఇషా ఇంట హోళీ వేడుకల్లో బాలీవుడ్ తారలు

  • Published By: vamsi ,Published On : March 7, 2020 / 08:46 AM IST
ఇషా ఇంట హోళీ వేడుకల్లో బాలీవుడ్ తారలు

ముంబైలో శుక్రవారం(06 మార్చి 2020) ఇషా అంబానీ ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి హోలీ పార్టీకి బాలీవుడ్‌కు చెందిన నటీనటులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నటి ప్రియాంక చోప్రా.. ఆమె భర్త నిక్ జోనాస్‌తో కలిసి పాల్గొన్నారు. క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఇషా త‌న భ‌ర్త ఆనంద్ పిర‌మ‌ల్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌ని త‌మ ఇంట్లో జ‌రిగిన హోలీ వేడుక‌ల‌కి ఆహ్వానించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు మరియు వీడియోలు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. కత్రినా కైఫ్ ప్రియాంక దంపతులతో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 

రంగు నీళ్ళ‌ల్లో త‌డుస్తూ ఒక‌రిపై ఒక‌రు నీళ్ళు చ‌ల్లుకుంటూ హోలీని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇది త‌న‌కు మొద‌టి హోలీ సెల‌బ్రేష‌న్ అని నిక్ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తెలిపాడు. ఇండియా నాకు రెండో ఇల్లు. ఇక్క‌డ హోలీ జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంది అంటూ ప్రియాంక భ‌ర్త‌ నిక్ జోనస్ వెల్లడించాడు.  

See Also | గూగుల్ రూల్స్ బ్రేక్ చేసిన ఇంజనీర్‌కు రూ.1300 కోట్ల ఫైన్!!