అమితాబ్తో నటించనున్న రమ్యకృష్ణ..!
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ పంచె, ధోతి ధరించి అచ్చమైన సౌతిండియన్లా మారిపోయారు. ‘నాన్ తమిళన్’ (నేను తమిళీయుడిని) అంటూ కొత్త లుక్తో పోజులిచ్చారు. ఇదంతా తమిళ చిత్రం ‘ఉయర్నత మనిథన్’ కోసం. అంతేకాదు అమితాబ్ బచ్చన్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. తమిళ్వానన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళం, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల సెట్స్ పైకి వెళ్లింది. చిత్ర ఫస్ట్ లుక్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ చిత్రంలో అమితాబ్ సరసన రమ్యకృష్ణ నటించనున్నట్టు తెలుస్తుంది. ఈమె పాత్ర కూడా చాలా పవర్ ఫుల్గా ఉంటుందని అంటున్నారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటించడం అదనపు బలం అని అంటున్నారు. 1998లో అమితాబ్, రమ్యకృష్ణ ‘బడే మియా చోటే మియా’ అనే హిందీ చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత కోలీవుడ్ చిత్రం కోసం వీరు కలిసి పని చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రకరణ ముంబైలో జరుగుతుండగా, ఇప్పటికే రమ్యకృష్ణ చిత్ర బృందంతో కలిసి షూటింగ్లో పాల్గొంటుందట.
అమితాబ్ బచ్చన్ కూడా ఆదివారం నుంచి షూటింగ్లో పాల్గొంటున్నారు. అంతేకాదు ఇక స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా కోసం అమితాబ్ 40 రోజులు తన డేట్స్ను కేటాయించారు. అమితాబ్తో కలసి పని చేయడం గురించి సూర్య తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ‘‘నా జీవితంలో మరువలేని క్షణాలివి. అమితాబ్ గారితో యాక్ట్ చేయాలనే నా కల నెరవేరుతోంది. దేవుడికి, మా అమ్మా నాన్నలకు థ్యాంక్స్’’ అన్నారు.