Kantara-2 : కాంతార-2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..

గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న చిత్రం 'కాంతార' (Kantara). రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ని తీసుకు రాబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా..

Kantara-2 : కాంతార-2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..

Rishab Shetty begins Kantara 2 writings

Kantara-2 : కేజీఎఫ్ తెరకెక్కించిన హోంబలే ఫిలిం నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’ (Kantara). రిషబ్ శెట్టి (Rishab Shetty), సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ కన్నడ నాట బ్లాక్ బస్టర్ హిట్టు అందుకోవడంతో.. నిర్మాతలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అనూహ్యంగా ఈ చిత్రం పాన్ ఇండియా హిట్టుగా నిలిచింది. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ క్వాలిఫై లిస్ట్ లో స్థానం దక్కించుకొని సంచలనం సృష్టించింది.

Kantara : కాంతార సినిమాకి అరుదైన గౌరవం.. ఐక్యరాజ్య సమితిలో రిషబ్ శెట్టి స్పీచ్..

ఇక ఇంతటి విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ తీసుకు వస్తాము అని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథా చర్చలు మొదలయ్యాయి అని తెలియజేస్తూ మరికొన్ని అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కడం లేదు, ప్రీక్వెల్ గా రాబోతుంది. కాంతార మూవీ మొదటిలో హీరో తండ్రి మాయమై పోతాడు. అతను ఎక్కడకి వెళ్ళాడు? అలాగే అతని జీవితం నేపథ్యంతో కాంతార-2 (Kantara2) కథ ఉండబోతుంది.

Kantara 2: క్రేజీ న్యూస్.. కాంతార-2లో సూపర్ స్టార్.. నిజమేనా?

ఈ ప్రీక్వెల్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను (Urvashi Rautela) హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. కాగా ఈ సినిమా కర్ణాటకలోని పంజుర్లి దైవ ఆచారాల నేపథ్యంతో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిపిస్తూ తెరకెక్కింది. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యే 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు భారీ అంచనాలు మధ్య విడుదలయ్యి ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు కొంతమంది.