Chiranjeevi: చిరుతో సాయి ధరమ్ మల్టీస్టారర్.. తనయుడిగా మేనల్లుడు?

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోం ది. ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ పాన్ ఇండియా మూవీగా రికార్డుల వేట కొనసాగుతున్న..

Chiranjeevi: చిరుతో సాయి ధరమ్ మల్టీస్టారర్.. తనయుడిగా మేనల్లుడు?

Chiranjeevi

Chiranjeevi: టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోం ది. ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ పాన్ ఇండియా మూవీగా రికార్డుల వేట కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే, మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మెగా మామా అల్లుళ్ల మల్టీస్టారర్‌ రాబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించపబోతున్నా రని సమాచారం.

Chiranjeevi: చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్!

ఇప్పటికే ఈ మెగా మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి కథ కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా చిరు దూకుడు చూపిస్తున్నారు. తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఈనెలలో రిలీజ్ కానుండగా.. మరో మూడు ప్రాజెక్టులు సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. అవి చాలదని ఇప్పుడు మరో సినిమాను కూడా సెట్ చేసే పనిలో ఉన్నాడట మెగాస్టార్.

Chiranjeevi: టార్గెట్ ఆగస్ట్ అంటోన్న గాడ్‌ఫాదర్..?

మలయాళంలో సూపర్ హిట్టైన బ్రోడాడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. మోహన్‌‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన ఈ సినిమా బాధ్యతను చిరు ఇప్పటికే డైరెక్టర్ హరీష్‌‌ శంకర్‌కి అప్పగించినట్లు ఇండస్ట్రీ టాక్. స్క్రిప్ట్‌‌లో చేయాల్సిన మార్పుల గురించి చర్చలు కూడా పూర్తవగా.. ఈ సినిమాలో చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొడుకు పాత్రలో నటించనున్నట్లు వినిపిస్తుంది. ఈ పాత్రకు ముందుగా వరుణ్ తేజ్ పేరు వినిపించినా.. బాడీ లాంగ్వేజ్, మేనరిజంలో సాయి ధరమ్ తేజ్ చిరుని మ్యాచ్ చేయగలడని, అందుకే మేనల్లుడినే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.