Samantha : నెటిజెన్లకు కౌంటర్ ఇచ్చిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం'. నిన్న హైదరాబాద్ లో శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సమంత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొంది. కాగా ఈ కార్యక్రమంలో సమంత లుక్ గురించి పలు సైట్‌ల్లో..

Samantha : నెటిజెన్లకు కౌంటర్ ఇచ్చిన సమంత..

Samantha countered the netizens tweets

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఇటీవల ఆమె ఏదో అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు ప్రకటించిన సమంత.. యశోద మూవీ రిలీజ్ సమయంలో ఒక పర్సనల్ ఇంటర్వ్యూతో మాత్రమే కెమెరా ముందుకు వచ్చింది. చాలా రోజులు తరువాత మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చింది సమంత. నిన్న హైదరాబాద్ లో శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సమంత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొంది.

Samantha : శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత..

కాగా ఈ కార్యక్రమంలో సమంత లుక్ గురించి పలు సైట్‌ల్లో.. ‘చాలా సన్నగా అయ్యిపోయింది, ఫేస్‌లో గ్లో అండ్ చార్మ్ తగ్గిందని’ అనేక కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక సైట్ చేసిన ట్వీట్ కి సమంత కౌంటర్ ఇచ్చింది. ‘విడాకుల తరువాత ఆమె ధైర్యంగా నిలబడింది, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా శిఖరాలకు చేరుకుంది అని అందరూ అన్నారు. కానీ ఆమెకు వచ్చిన వ్యాధి ఆమెను మళ్ళీ బాగా బలహీన పరిచింది’ అంటూ ట్వీట్ చేసింది.

దీనికి సమంత.. ‘నాకు వచ్చిన అరుదైన వ్యాధి నీకు రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నెలలు తరబడి నేను తీసుకున్న చికిత్స నువ్వు తీసుకోకూడదని నేను కోరుకుంటున్నా. నీ గ్లో పెరగడానికి నీ పై నేను చూపిస్తున్న ప్రేమ ఇది’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ‘శాకుంతలం’ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

నిన్న విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.. సినిమాలోని విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్రలో కనిపిస్తుండగా.. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.