Nithya Menen: భీమ్లా నాయక్ భార్యగా..
ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం నిత్య మీనన్ను సెలెక్ట్ చేశారు..
Nithya Menen: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కమ్ సింగర్ నిత్య మీనన్ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో క్రేజీ మూవీ చెయ్యబోతున్నారు. పవర్స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్స్టార్..
సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే- డైలాగ్స్ రాస్తున్నారు. పవన్ పవర్ఫుల్ పోలీస్గా ‘భీమ్లా నాయక్’ క్యారెక్టర్లో కనిపించనున్నారు.
Making Glimpse : పవన్ – రానా.. ఎవరూ తగ్గట్లేదుగా..
ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం నిత్య మీనన్ను సెలెక్ట్ చేశారు. పవన్కి జోడీగా ఆమె కనిపించనున్నారు. ప్రస్తుతం జెట్ స్పీడ్తో షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లుక్ అండ్ మేకింగ్ గ్లింప్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చెయ్యనున్నారు.
We are extremely delighted to welcome an exceptional & proficient talent @menennithya on board for our #ProductionNo12 ⭐#BheemlaNayak Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/xxfRx8znFZ
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2021