చియాన్ 58లో శ్రీనిధి శెట్టి

‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌‌లో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఫిక్స్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 17, 2019 / 07:49 AM IST
చియాన్ 58లో శ్రీనిధి శెట్టి

‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌‌లో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఫిక్స్ చేశారు..

‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫమ్ చేశారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్.. వయాకామ్ 18 స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో.. మొదట ప్రియా భవానీ శంకర్‌ను హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి.

‘ఇండియన్ 2’, ఎస్‌జే సూర్య సినిమాల కారణంగా ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో శ్రీనిధి శెట్టిని తీసుకున్నారు. విక్రమ్ నటిస్తున్న 58వ సినిమా ఇది. శ్రీనిధి శెట్టికి కోలీవుడ్‌లో ఫస్ట్ మూవీ.. శ్రీనిధి ‘కేజీఎఫ్’ సీక్వెల్  ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నటిస్తుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు.

Read Also : కొత్త సినిమాలో కీర్తి లుక్ చూశారా!

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోయే ఈ మూవీలో ఒక పవర్‌ఫుల్ అండ్  స్టైలిష్ యాక్షన్ రోల్‌లో ఇర్ఫాన్ కనిపించనున్నాడు. సంగీతం : ఏఆర్ రెహమాన్, కెమెరా : శివకుమార్ విజయన్, ఆర్ట్ : అమరన్. 2020 ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.