Dhanush : ధనుష్ హీరో.. నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి

హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ లపై ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మారుతున్నారు.

Dhanush : ధనుష్ హీరో.. నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి

Dhanush

Dhanush :   ఇటీవల వరుసగా తమిళ్ హీరోలు తెలుగు దర్శకులతో డైరెక్ట్ తెలుగు సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో ధనుష్ తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’ లో రానా సరసన చేస్తున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ఇవాళ పూజా కార్యక్రమం జరుపుకుంది.

ఈ సినిమాకి తెలుగులో ‘సార్‌’, తమిళ్ లో ‘వాతి’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ కాగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కావడం విశేషం. ఈ సినిమాతో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మారుతున్నారు. అయితే భార్య పేరు ఉన్నా త్రివిక్రమ్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. దీంతో త్రివిక్రమ్ కూడా సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Telugu Cinema : తెలుగు దర్శకుల వైపు తమిళ హీరోల చూపు

ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ లపై ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. జనవరి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరగనుందని తెలిపారు.