బీహార్లో తెల్లవారుఝామున ఘోరం రోడ్డు ప్రమాదం..11మంది మృతి
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్ ఒకదానినొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఎక్కడివారు? ప్రమాదం ఎలా జరిగింది? వంటి కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
కాగా..రోడ్డు ప్రమాదాలు జరుగని రోజంటూ లేకుండా పోతోంది. ప్రతీరోజు ఎక్కడోకచోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపటం..అతి వేగం..నిర్లక్ష్యం..నిద్రలేమి వంటి పలు కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ఆయా రాష్ట్రాల అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా..రూల్స్ ఎంతగా పెట్టినా రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టలేకపోతున్నారు.
ఏది ఏమైనా వాహనాలు నడిపేవారు..నిదానమే ప్రదానం అనే మాటలను మరచిపోతున్నారు. వారి నిర్లక్ష్యానికి ఎన్నో కుటుంబాలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మీయులను..సహచరులను కోల్పోయి తీవ్ర మానసిక వేదనలకు గురవుతున్నారు. సందర్భాలలో కుటుంబాలకు కుటుంబాలే ఈ ప్రమాదాలకు బలైపోతున్నారు.
Bihar: 11 dead, 4 injured in a collision between a Scorpio vehicle and a tractor on NH-28 in Kanti Police Station area of Muzaffarpur https://t.co/PQpPvK9s9u pic.twitter.com/ZHSzjbi9lu
— ANI (@ANI) March 7, 2020
See Also | జియో వినియోగదారులకు మరో బిగ్ షాక్