Udaipur Killing: ఉదయ్‌పూర్ హత్యపై 16ఏళ్ల బాలిక ఫేస్‌బుక్ పోస్ట్.. చంపేస్తామంటూ బెదిరింపులు

రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ హత్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 16ఏళ్ల బాలికను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. సౌత్ ముంబైకి చెందిన బాలిక వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తాను చేసిన పోస్టును చూపిస్తూ... బెదిరింపులు వస్తున్నాయంటూ కంప్లైంట్ చేసింది.

Udaipur Killing: ఉదయ్‌పూర్ హత్యపై 16ఏళ్ల బాలిక ఫేస్‌బుక్ పోస్ట్.. చంపేస్తామంటూ బెదిరింపులు

Kanhaiya Lal

Udaipur Killing: రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ హత్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 16ఏళ్ల బాలికను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. సౌత్ ముంబైకి చెందిన బాలిక వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తాను చేసిన పోస్టును చూపిస్తూ… బెదిరింపులు వస్తున్నాయంటూ కంప్లైంట్ చేసింది.

“కన్హాయ లాల్ అనే వ్యక్తిని హత్య చేశారంటూ కొన్ని కామెంట్లు రాస్తూ బాలిక తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ వచ్చిందని.. ఆ పోస్టుపై పెట్టిన కామెంట్లకు గానూ ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు” పోలీసులు వెల్లడించారు.

ఆమె చేసిన ఫిర్యాదు మేరకు గుర్తు తలియని వ్యక్తులు అని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read Also : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు

కన్హయ లాల్ హత్య
మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్లు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య అనే వ్యక్తి సోషల్ మీడియాలో జూన్ 28న పోస్టు పెట్టాడు. ఆ తర్వాత షాపులో ఉండగానే ఇద్దరు దుండగులు కస్టమర్ల రూపంలో వచ్చి హత్యకు పాల్పడ్డారు.

అమరావతిలో కెమిస్ట్
జూన్ 21న కెమిస్ట్ ఉమేశ్ కొల్హె ఇదే కారణంతో హత్యకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు.