JP Nadda: అవినీతిలో కాంగ్రెస్ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది: జేపీ నడ్డా

 అవినీతిలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆప్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని, దాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఢిల్లీ ప్రభుత్వం నడుపుతోన్న సైన్స్ పాఠాలే లేవని అన్నారు.

JP Nadda: అవినీతిలో కాంగ్రెస్ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది: జేపీ నడ్డా

JP Nadda: అవినీతిలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆప్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని, దాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ఢిల్లీ ప్రభుత్వం నడుపుతోన్న సైన్స్ పాఠాలే లేవని అన్నారు.

1951లో భారతీయ జన సంఘ్ ను ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి దేశంలోని పార్టీల సిద్ధాంతాలు మారాయని జేపీ నడ్డా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నాచెల్లెళ్ల పార్టీగా మారిందని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని మొదటి నుంచీ చెబుతున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప బలంతో ఇప్పుడు అది రద్దు అయిందని చెప్పారు. ఇది తమ రికార్డు అని జేపీ నడ్డా అన్నారు.

సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ లక్ష్యా ఆవశ్యకతను మోదీ గుర్తించారని జేపీ నడ్డా చెప్పారు. కరోనా విజృంభణ వేళ ఇతర రాజకీయ పార్టీలు వీడియో-కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ రాజకీయాలు చేస్తుంటే, బీజేపీ కార్యకర్తలు మాత్రం ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై తమ నిబద్ధతను చాటారని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..