రైతు ఉద్యమం : రిహానా ట్వీట్ కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

రైతు ఉద్యమం : రిహానా ట్వీట్ కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

Amit Shah రైతుల ఉద్యమంపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని..దేశ పురోగతిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ భవిష్యత్‌ను నిర్ణయించేది విష ప్రచారాలు కాదు.. అభివృద్ధి అని అమిత్ షా అన్నారు.

రిహానా ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భగ్గుమన్నారు. ఉద్యమం చేస్తుంది రైతులు కాదని, దేశాన్ని విభజించాలని అనుకుంటున్న ఉగ్రవాదులని ట్వీట్ చేశారు. దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చైనా కాలనీలుగా మార్చాలని అనుకుంటున్నారు. మీలా మా దేశాన్ని అమ్ముకోవాలని అనుకోవడం లేదని రిహానాపై కంగనా విరుచుకుపడ్డారు.

కాగా, కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా ఆందోళన చేస్తోన్న రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీల‌ు మంగళవారం నుంచి ట్వీట్లు చేస్తోన్న విషయం తెలిసిందే. మొదటగా, ప్రముఖ బార్బేడియన్ పాప్ సింగ‌ర్ రిహానా… మనమెందుకు దీని గురించి మాట్లాడడం లేదంటూ రైతుల ఆందోళనపై సీఎన్ఎన్ కథనాన్ని పాప్ సింగ‌ర్ రిహానా మంగళవారం చేసిన ట్వీట్ చాలా సేపు ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. పూర్తి స్థాయి అవగాహన తర్వాత స్పందించాలని మరికొంతమంది హితవుపలికారు. రిహానా బాటలో మరికొంత మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు(మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా, ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ రిహానా, యాక్టివిస్ట్ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్ మేన‌కోడ‌లు, లాయ‌ర్ మీనా హారిస్ సహా పలువురు)రైతులకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో వారి ట్వీట్లకు అమిత్ షా కౌంటరిచ్చారు.

ఇక, రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సెలబ్రెటీల ట్వీట్లతో అప్రమత్తమైన కేంద్ర విదేశాంగ శాఖ.. కావాలనే కొందరు బాధ్యతరహిత ట్వీట్లు చేస్తున్నారని విమర్శించింది. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు సంయమనంతో వున్నారని సమర్ధించుకుంది. బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో..ఇది దేశంలోని ఓ ప్రాంతంలో కొద్ది మంది రైతులు మాత్ర‌మే చేస్తున్న ఆందోళ‌న. ఇది భార‌త‌దేశ అంత‌ర్గత వ్య‌వ‌హారం. ఇలాంటి వాటిపై స్పందించే స‌మ‌యంలో వాస్త‌వాలు తెలుసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అంశాంపై సెల‌బ్రిటీల సెన్సేష‌న‌లిస్ట్ సోష‌ల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు స‌రికావు. వారిది బాధ్య‌తా రాహిత్యం అని స్ప‌ష్టం చేసింది. రైతుల్లోని కొన్ని స్వార్థ‌ప‌ర‌మైన గ్రూపులు త‌మ ఎజెండాను ఈ ఆందోళ‌న‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని, ఈ గ్రూపులే ఇండియాకు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నాయ‌ని విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అలాంటి వాళ్ల వ‌ల్లే కొన్ని దేశాల్లో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాల ధ్వంసం జ‌రుగుతోంద‌ని, ఇది ఇండియాను చాలా బాధించింద‌ని చెప్పింది.