Mahant Nritya Gopal Das : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడి ఆరోగ్యం విషమం

గతంలో కూడా గోపాల్ దాస్ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా మేదాంత ఆసుపత్రిలోనే గోపాల్ దాస్ చికిత్స పొందారు.

Mahant Nritya Gopal Das : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడి ఆరోగ్యం విషమం

Mahant

Mahant Nritya Gopal Das : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు మహంత్​ న్రిత్య గోపాల్​ దాస్​ ఆరోగ్యం విషమంగా ఉంది. గత కొద్ది రోజులుగా మహంత్​ న్రిత్య గోపాల్​ దాస్​ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల చికిత్స కోసం ఆయన్ను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

గోపాల్​ దాస్​ ఆరోగ్యస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. చికిత్సను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. అయోధ్యలో రామమందిర్​ను నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రకు​ గోపాల్ దాస్ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర గర్భగుడి నమూనా చిత్రం విడుదల: 2023 చివరి నాటికి విగ్రహ ప్రతిష్ట

గతంలో కూడా గోపాల్ దాస్ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా మేదాంత ఆసుపత్రిలోనే గోపాల్ దాస్ చికిత్స పొందారు. 2021 అక్టోబరులో కూడా కోవిడ్​ సోకిన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.