బీజేపీ అనూహ్య నిర్ణయం.. సుమలతకు సపోర్ట్ చేస్తుందట

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 01:49 AM IST
బీజేపీ అనూహ్య నిర్ణయం.. సుమలతకు సపోర్ట్ చేస్తుందట

లోక్ సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. దివంగత కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్‌ చనిపోవడంతో మాండ్యా స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన అంబరీష్ భార్య హీరోయిన్ సుమలత కాంగ్రెస్ నుండి టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుంది. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉండగా.. అందులో భాగంగా సీట్ల సర్దుబాటులో మాండ్య స్థానంను జేడీఎస్‌కు కేటాయించింది కాంగ్రెస్‌. ఈ స్థానం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి  జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి తరుపున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు.
సుమలత భర్త కన్నడ నటుడు అంబరీష్‌ మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన అంబరీష్‌ కాంగ్రెస్‌ తరపున 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. ఇదిలా ఉంటే సుమలతకు మద్దతు ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇంతకుముందే సుమలతకు ఫోన్‌ చేసినట్లు వార్తలు రాగా తాజాగా బీజేపీ ఆ వార్తలను నిజం చేసింది. మాండ్యా లోక్ సభ నియోజకవర్గంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మాండ్యా నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడం లేదని వెల్లడించింది. దీంతో నిఖిల్ గెలుపు కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.