Chhattisgarh : స్టేజి పైనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

ఛ‌త్తీస్‌ఘఢ్ కాంగ్రెస్ లో వ‌ర్గ‌విభేదాలు మరోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. జష్‌పూర్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సులో..స్థానిక కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల మధ్య వాగ్వాదం

Chhattisgarh : స్టేజి పైనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

Congress

Chhattisgarh  ఛ‌త్తీస్‌ఘఢ్ కాంగ్రెస్ లో వ‌ర్గ‌విభేదాలు మరోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. జష్‌పూర్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సులో..స్థానిక కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్‌ గురించి జష్‌పూర్‌ జిల్లా మాజీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ అగ‌ర్వాల్ మాట్లాడటం మొదలుపెట్టగానే కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇఫ్తికర్ హసన్ ఒక్కసారిగా స్టేజ్‌పై వచ్చి ఆయన నుంచి మైక్ లాక్కున్నారు. అగర్వాల్‌ను ముందుకు నెట్టారు. దాంతో అగ‌ర్వాల్ మ‌ద్దతుదారులు, అత‌ని వ్య‌తిరేకులు, బౌన్స‌ర్‌లు అంతా స్టేజీపైకి ప‌రుగు తీయడంతో కాసేపు ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో వేదిక‌పై ఉన్న సీనియ‌ర్ నేత‌లు లేచి వెళ్లిపోయారు.

ఈ ఘటన అనంతరం పవన్ అగర్వాల్ మాట్లాడుతూ.. టీఎస్ సింగ్ దేవ్, ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు దేవ్ కోసం బఘెల్ తన పదవిని వదులుకోవాలన్నారు. రెండున్నరేళ్ల పాటు తన వంతు కోసం దేవ్ వేచిచూశారని, దేవ్, బఘెల్ కలిసి పనిచేయకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేది కాదన్నారు. ఇదే విష‌యం స్టేజీ మీద మాట్లాడుతుండ‌గా స్థానిక ఎమ్మెల్యే కున్‌కురి మ‌నుషులు త‌న‌పై దాడి చేశార‌న్నారు.

కాగా, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ఇటీవల తలెత్తిన నాయకత్వ సంక్షోభం పార్టీ హైకమాండ్ వద్దకు చేరింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల సీఎం పదవిని టీఎస్ సింగ్ ఆశిస్తుండగా, అందుకు బఘెల్ నిరాకరిస్తున్నారు. గత నెలలో రాహుల్ గాంధీ ఈ ఇద్దరు నేతలతో విడివిడిగా సమావేశమై తాత్కాలికంగా సమస్యను సద్దుమణిగేలా చేశారు.